telugu navyamedia
సినిమా వార్తలు

పాన్ ఇండియా చిత్రాలకు కార‌ణం రాజ‌మౌళి – కరణ్ జోహార్

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ జంటగా న‌టిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా లెవ‌ల్‌ తెరకెక్కుస్తున్నారు.ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటించడం జరిగింది.

తెలుగులో ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది పార్ట్ 1 మాత్రమే. ఈ చిత్రానికి తదుపరి భాగాలు కూడా ఉన్నాయి.

షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ లో నేడు మీడియా సమక్షంలో మోషన్ పోస్టర్ విడుదల చేశారు.  ఊహించని సర్ ప్రైజ్ ఏంటంటే బ్రహ్మాస్త్రం చిత్రాన్ని సౌత్ లో రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు.

SS Rajamouli to present Ranbir Kapoor and Alia Bhatt starrer Brahmāstra in  four South Indian languages : Bollywood News - Bollywood Hungama

బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. రణబీర్ కపూర్ వేదికపైకి రాగానే రాజమౌళి పాదాలకు నమస్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో కరణ్ జోహార్ మాట్లాడుతూ రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. మనమంతా ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అందుకు కారణం  రాజమౌళి. రాజమౌళి వల్ల భాషా బేధాలు మొత్తం తొలిగిపోయాయ‌ని అన్నారు.

‘బ్రహ్మాస్త్ర’ను తెలుగు, హిందీ సహా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను 2022 సెప్టెంబర్​ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Related posts