దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో యంగ్ ఆది హీరోగా నటించిన తాజా చిత్రం “బుర్రకథ”. ఎన్నో సినిమాలకు కథలు అందించిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రంలో ఆది సరసన హీరోయిన్ గా మిస్తీ చక్రవర్తి నటించారు. నైరా షా మరో హీరోయిన్ గా కన్పిస్తోంది. రాజేంద్ర ప్రసాద్తా, పోసాని, పృథ్వీ, ప్రభాస్ శ్రీను, గాయత్రి గుప్తా, ఫిష్ వెంకట్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏ చిత్రానికి హెచ్.కే. శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఒకే శరీరంలో రెండు వేర్వేరు బుర్రలున్న పాత్రలో ఆది కనిపించబోతున్నాడు. అమాయకుడైన రామ్, అల్లరి కుర్రాడైన అభి అనే రెండు పాత్రలు చూసినట్లు మనకు అనిపించినా సినిమాలో మాత్రం ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. “రామాయణంలో రాముడికి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు కంసుడు. కానీ, నా శత్రువు నాతోనే ఉన్నాడు” అంటూ ఆది చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చివర్లో “సాహో” ట్రైలర్లో ప్రభాస్ చెప్పిన “ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్” డైలాగ్ను కమెడియన్ పృథ్వీ తనదైన శైలిలో చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.