ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఛార్మి… ప్రస్తుతం నిర్మాతగా మారింది. సినిమాల్లో నటించడం మానుకున్నాక డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆమె.. ఈ బ్యానర్ బాధ్యతలు పూర్తిగా మోస్తూ పలు సినిమాలు రూపొందిస్తోంది. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ సక్సెస్ సాధించి లాభాలు గడించింది. కెరీర్ పరంగా విజయాలందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందనే వార్తలు ఫిలిం నగర్ సర్కిల్స్లో షికారు చేస్తున్నాయి. 33 ఏళ్ల ఈ చార్మింగ్ బ్యూటీ ఇన్నాళ్ల పాటు తన పెళ్లి విషయాన్ని పక్కనబెట్టి కెరీర్ పరంగా స్ట్రాంగ్ అయింది. ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ బాట పడటంతో ఇక పెళ్లిచేసుకొని సెటిలవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఛార్మి పెళ్లి విషయంలో మరో ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే.. ఈ పాటికే ఆమె పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చేశారని, లాక్డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై స్పందించిన ఛార్మి.. ఆ బాధ్యతలను మాత్రం పెద్దలకే అప్పగించానని, వాళ్లు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తలపై ఛార్మి రియాక్ట్ అవుతుందా? లేదా? అనేది.
previous post