కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అందుకని కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే థియేటర్స్, స్కూల్స్, బార్స్ అన్ని మార్చి 31, 2020 వరకు మూతపడ్డాయి. ఈ సందర్భంగా కరోనా వైరస్ పై రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.ఈ వైరస్ వల్ల ప్రపంచం నిలిచిపోవడం చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఇలాంటి పరిస్థితులలో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా ఉండటం చాలా అవసరం. కరోనా వ్యాప్తిని నివారించడానికి జాగ్రత్తలు పాటించండి అని రాజమౌళి తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో చాలా మంది విదేశీయుల నటిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీయుల వీసాలని కేంద్రం తాత్కాలిక రద్దు చేసిన నేపథ్యంలో RRR చిత్ర షూటింగ్కి బ్రేక్ పడే అవకాశం ఉందని అంటున్నారు.
next post