దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎమోషనల్తో పాటు పలు కామెడీ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ చిత్రాన్ని సమంత భారీగా ప్రమోట్ చేసుకుంది. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమంత తనకి ఇద్దరు డైరెక్టర్స్తో పని చేయాలని చాలా ఆసక్తిగా ఉందని పేర్కొంది. అందులో ఒకరు యూత్ఫుల్ చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించగల దర్శకుడు శేఖర్ కమ్ముల. మరొకరు ఆణిముత్యాల్లాంటి సినిమాలని తెరకెక్కించే మణిరత్నం. వీరిద్దరి దర్శకత్వంలో ఎప్పటికైన ఓ సినిమా చేయాలనుందని సమంత చెప్పడం విశేషం. అయితే ప్రస్తుతం సమంత భర్త చైతూ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఇందులో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటారా ? లేదా ? అనేది తెలియాల్సిఉంది.
previous post
ఇద్దరు కమిట్మెంట్ అడిగారు : రోహిణి