telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రేయసి పై దాడి చేసిన ప్రేమోన్మాది మృతి…

నిన్న యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి గాయపరిచాడు జగిత్యాల జిల్లాలో. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకోగా.. నిన్న రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జగిత్యాల మండలం జాబితా పూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల భవాని అమ్మమ్మ ఊరు మేడిపల్లి మండలం మన్నెగూడెం కావడంతో అమ్మమ్మ ఇంట్లో ఉండేది. మన్నెగూడెం గ్రామంలోనే పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కూడా అదే స్కూల్ లో 10వ తరగతి వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు. రాజ్ కుమార్ 4 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి 9 నెలల క్రితం అతని చెయ్యి ఫ్యాక్చర్ కాగా తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే రాజ్ కుమార్ దుబాయ్ లో ఉన్నపుడు భవానితో చాటింగ్ చేసే వారని సమాచారం. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు రాజ్ కుమార్ ఫోన్ ద్వారా వాట్స్ అప్ డేటాను సేకరిస్తున్నారు. యువతిని జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Related posts