తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.ఛత్ పూజా సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాంపింగ్ చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
మెబైల్ ఫోన్ల నుంచి సమాచారం సేకరించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు.తన ఫోన్ ట్యాప్ చేసినట్లు గతంలో చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి అని విమర్శించారు. దీంతో మనం ఎవరితో స్వేచ్ఛగా మాట్లాడలేమని అన్నారు. అలాగే చాలా మంది ప్రముఖల వ్యక్తిగత సమచారం చోరీకి గురవుతుందని ఆరోపించారు.
ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదు: చంద్రబాబు