telugu navyamedia
క్రీడలు వార్తలు

జీవా ధోనికి అత్యాచార బెదిరింపులు…

సోషల్ మీడియా వేదికగా భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూతురు అయిన జీవా ధోనికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. ఐపీఎల్ 2020 లో చివరగా చెన్నై గత బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో ధోని, అతని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఈ ఆరోపణలు వచ్చాయి. అయితే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ధోని 12 బంతుల్లో కేవలం 11 పరుగులు చేయగలిగాడు. ఈ ఓటమి తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ధోని కుటుంబం కు సంబంధించి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అందులో మరి కొంతమంది ధోని 5 సంవత్సరాల కూతురు అయిన జీవా ధోనికి సంబంధించి అత్యాచార బెదిరింపులకు పాల్పడుతునారు.దాంతో చాలా మంది ధోని అభిమానులు అలాగే ప్రజలు ఇటువంటి అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో ఆడుతున్నాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 13వ సీజన్ లో 6 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. అందువల్ల చెన్నై ప్లేఆఫ్‌లోకి రావడానికి బలమైన పునరాగమనం అవసరం.

Related posts