telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రక్షణ అధికారులే అరెస్ట్.. ఎక్కడంటే…?

అక్కడ పోలీసులు నలుగురు రక్షణ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణం వారి ఇటీవల జరిగిన హత్యకు సంబంధం ఉందని తెలిపారు. ఈ ఘటన పాకీస్తాన్‌లో చోటు చేసుకుంది. పాకీస్తాన్ డాల్ఫిన్ ఫోర్స్‌కు చెందిన నలుగురు అధికారులపై ఆ దేశ పోలీసులు కేసును నమోదు చేశారు. ఇటీవల లాహోర్‌లో జరిగిన హత్యకు వారికి సంబంధం ఉందని అందుకే వారిపై కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపారు. లాహోర్‌లో జహంగీర్ అనే వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో మరణించాడని ఫోర్స్ అదికారులు అన్నారు. అయితే డాల్సిన్ ఫోర్స్ దీనిపై స్పందిస్తూ తమకు ఓ మహిళ ఫోన్ చేసిందని అమెను నలుగురు వెంబడిస్తున్నారిన, వారు తనను అత్యాచారం చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో వారు అక్కడకు వెళ్లారని తెలిపారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో అతడు మరణించాడని తెలిపారు. మిగిలిన వారు ఘటనా స్థలం నుంచి పారిపోయారని అన్నారు. కానీ బాధితుడి కుటుంబం ఇచ్చిన నివేదిక ప్రకారం అతడు ఘటనా సమయంలో ఒంటరిగా ఉన్నాడని, పోలీసులు కావాలనే కట్టుకథలు చెబుతున్నారని అన్నారు. అంతేకాకుండా విచారణ పూర్తయ్యేవరకు డాల్ఫిన్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌ మూసివేయాలని అన్నారు.

Related posts