telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. 8 మంది ఉగ్రవాదుల హతం

kashmir encounter

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. పాంపొరాలోని ఓ మసీదులో తలదాచుకున్న ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌నువినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్‌లో ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ రోజు ఉదయం 10.45 నుంచి పాకిస్థాన్‌ రేంజర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతుండడంతో వారి దాడిని భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారు.

Related posts