జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పాంపొరాలోని ఓ మసీదులో తలదాచుకున్న ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్నువినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్లో ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ రోజు ఉదయం 10.45 నుంచి పాకిస్థాన్ రేంజర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతుండడంతో వారి దాడిని భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లో పాక్ జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారు.
నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయం: అసదుద్దీన్