ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి గారి అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమిత్ షా ట్వీట్ చేశారు.
ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం అని కీర్తించారు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. జయప్రకాశ్ రెడ్డి స్థానం భర్తీ చేయలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాని తెలిపారు.
అందరూ ఎన్టీఆర్ కావాలంటున్నారు …