telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోనీ గురించి కొత్త విషయాన్ని చెప్పిన ఓజా…!

టీమిండియాకు కెప్టెన్ గా తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు ధోని. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఏ కెప్టెన్‌ అయినా వారి టీమ్‌కు గుడ్‌లక్‌ చెప్పి సూచనలు ఇవ్వడం మామూలే. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మాత్రం మ్యాచ్‌కు ముందు తమ జట్టు ఆటగాళ్లకు ఎలాంటి గుడ్‌లక్‌ చెప్పడట. అలా చెప్పడం ఎప్పటినుంచో మానేశాడట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్‌ ఓజా తెలిపాడు. అయితే మహీ అలా చేయడానికి ఒక కారణం ఉందని ఓజా పేర్కొన్నాడు. తన జట్టులోని ఆటగాళ్లకు గుడ్‌లక్‌ లేదా ఆల్‌ ది బెస్ట్‌ చెబితే.. మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకంగా జరుగుతుందని ధోనీ నమ్ముతాడట. ఇలా ధోనికి కొన్ని సెంటిమెంట్స్‌ ఉన్నాయని, వాటిని బలంగా నమ్ముతానని.. అందుకే మ్యాచ్‌కు ముందు నా జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడని తెలిపాడు.

Related posts