telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గిరిజనుల హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత: చంద్రబాబు

chandrababu

గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు లేఖ రాశానని చెప్పారు.స్వతంత్ర భారతదేశంలో గిరిజనులెవ్వరూ వారి అవకాశాలను పోగొట్టుకోకూడదని అన్నారు.

దోపిడీకి గురికాకూడదని నాటి రాజ్యాంగ పరిషత్ లో ఒకే ఒక గిరిజన ప్రతినిధి శ్రీ జైపాల్ సింగ్ ముండా పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగ నిబద్ధత ప్రకారం గిరిజనులు ఎదిగే అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం 2000, జనవరి 10వ తేదీన జీవో నం.3ని తెచ్చిందన్నారు.

రెండు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఆ జీవో ఇప్పుడు అమలు కాకుండా పోయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా గిరిజనుల హక్కులను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Related posts