telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు: చంద్రబాబు ఫైర్

chandrababu

వైసీపీ ప్రభుత్వం పై ఏపీ విపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర పాలన ‘రివర్స్’లో నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల టెండర్లన్నీ రిజర్వ్ చేసుకుని నిధుల ఆదా పేరుతో తమ సొంతవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

సెలవుల అనంతరం ఈ రోజు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా టీడీపీ ‘రివర్స్’పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని కోరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు.

Related posts