సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం ఉదయం భేటీ అయ్యారు.
ఇరువురి మధ్య ఏ విధమైన చర్చలు జరిగియానేది వెల్లడించలేదు. చంద్రబాబుతో భేటీ అనంతరం బయటకు వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెనుదిరిగారు. వైసీపీలో చేరి ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనలో మాగుంట ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..