telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుతో మాగుంట భేటీ

సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఏపీ రాజకీయాల్లో వలసలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం ఉదయం భేటీ అయ్యారు. 
ఇరువురి మధ్య ఏ విధమైన చర్చలు జరిగియానేది వెల్లడించలేదు. చంద్రబాబుతో భేటీ అనంతరం బయటకు వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెనుదిరిగారు.  వైసీపీలో  చేరి ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనలో మాగుంట ఉన్నట్లు  తెలుస్తోంది.

Related posts