టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో చంద్రబాబు హాజరయ్యారు.
సమావేశం అనంతరం చంద్రబాబు, ప్రధాని మోదీ ప్రత్యేకంగా సుమారు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు ఢిల్లీ రావాలని చంద్రబాబును ప్రధాని కోరినట్లు సమాచారం.
ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు, తెదేపా బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా చంద్రబాబు.. పలువురు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ , అర్చున్ ముండా, పి.టి ఉష , నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, హీరో రజనీకాంత్ పలు రంగాల ప్రముఖులను కలిశారు.
హీరో రజనీకాంత్తో అప్యాయంగా మాట్లాడుతున్న చంద్రబాబు
రాజకీయ పరమైన సమావేశాలు లేకున్నా.. చాలా కాలం తర్వాత చంద్రబాబు పర్యటన రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.
ఎమ్మెల్సీ ఫలితాలే లోక్సభ ఎన్నికల్లో పునరావృతం: విజయశాంతి