ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందాడు. దంతేవాడ-ఇంద్రవతి నదిపై మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఇంద్రవతి నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ వంతెనకు జవాన్లు సెక్యూరిటీగా ఉన్నారు. ఈ సమయంలో మందుపాతర పేలడంతో జవాన్ శరీరం ముక్కలుగా మారిపోయింది. ఘటనా స్థలం రక్తసిక్తంగా మారిపోయింది. మందుపాతర పెట్టిన స్థలంలో జవాన్ భోజనం చేస్తుండగా ఈ పేలుడు జరిగింది. పొరపాటున ప్రెషర్ ఐఇడి బాంబుపై అడుగుపెట్టిన సిఏయఫ్ 22 బెటాలియన్ కు చెందిన హెచ్ సీ లక్ష్మీ కాంత్.. మందుపాతర పేలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ స్వస్థలం మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాగా తెలుస్తోంది. విషయం తెలియడంతో మందుపాతరల్ని గుర్తించేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది.