telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్!

Ycp Mla srinivas rao

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కరోనా మహమ్మారి అన్ని రంగాల వారిని టచ్ చేస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియక పలువురిలో ఆందోళన నెలకొంది. ఈ వైరస్ ప్రజాప్రతినిధుల్లోనూ రోజు రోజుకు కరోనా టెన్షన్ ఎక్కువవుతోంది. మొన్నటివరకు తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

తాజాగా ఏపీలో శాసన సభ్యులపై కరోనా వైరస్ కలకలం మొదలైంది. విజయనగరం ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఈ మధ్యే అమెరికా నుంచి తిరిగివచ్చిన శ్రీనివాస్ రావు హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా లక్షణాలుండడంతో విజయనగరం జిల్లా వైద్యాధికారులు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడమతో కడుబండి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు సమాచారం.

Related posts