telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

క్రికెట్‌ బంతి తగిలి బాలుడి మృతి!

Crime

క్రికెట్‌ బంతి తగిలి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. స్థానిక కార్వాన్‌పేటకు చెందిన మైనుద్దీన్ (12) ఆరో తరగతి చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసి నిన్న సాయంత్రం క్రికెట్ ఆడుకునేందుకు మసీదుపుర మైదానానికి వెళ్లాడు. ఆట ముగిసిన తర్వాత మైదానంలో కూర్చుని సేద తీరుతున్నాడు.

ఈ క్రమంలో మరో బాలుడు కొట్టిన బంతి వేగంగా వచ్చి మైనుద్దీన్ ఛాతీ భాగంలో బలంగా తాకింది. దీంతో బాలుడు కుప్పకూలిపోవడంతో మిగతా బాలురు హడలిపోయారు. గమనించిన స్థానికులు బాలుడికి నీళ్లు తాగించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు.

Related posts