telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ వైపే మొగ్గుచూపుతున్న మ్యాచ్…

భారత్-ఆసీస్ మధ్య నేడు జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజులో రెండో శేషం ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 98 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన భారత్… ఈరోజు మొదటి సెషన్ లో దూకుడు చూపించింది. ఆ మొదటి సెషన్ పూర్తయే సమయానికి  206/3 తో నిలిచిన భారత్. ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో విజయం సాధించడానికి భారత్ బలంగా ప్రయత్నిస్తుంది. పుజారాతో జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన పంత్ 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ ఆతర్వాత పుజారా 77 కి వెనుదిరిగాడు. ప్రస్తుతం 280/5 తో ఉంది. ప్రస్తుతం అశ్విన్ (7), విహారి (4) తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ముగియడానికి ఇంకా 36 ఓవర్లు మాత్రమే బాకీ ఉన్నాయి. కానీ భారత్ కు విజయానికి ఇంకా 127 పరుగులు కావాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts