తెలంగాణలో టీఎస్ఈసెట్ ప్రవేశ పరీక్ష తేదీ వెలువడింది. డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసినవారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్రవేశాలు కల్పించే టీఎస్ ఈసెట్-2020 పరీక్ష తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) ఈ నెల 31న జరగనున్నది.
ఆన్లైన్లో జరగనున్న ఈ ప్రవేశపరీక్షను జేఎన్టీయూ హెచ్ నిర్వహిస్తున్నది. ఆగస్టు 31న రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ నెల 25న ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్ tsche.ac.inలో అడ్మిట్ కార్డులు లేదా హాల్టికెట్లను విడుదల చేయనున్నారు. పూర్తివివరాలకు ecet.tsche.ac.in చూడవచ్చని జేఎన్టీయూ వెల్లడించింది.
రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారు: శివసేన