తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ బారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,392 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో మృతి చెందగా, 2,346 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,12,587మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 304 కరోనా కేసులు నమోదయ్యాయి.
బీజేపీ ముక్త్ భారత్ కు కేసీఆర్ పిలుపు..అందుకు ప్రతీఒక్కరు సన్నద్ధం కావాలి