టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గుంటూరులోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం కోడెల నివాసంలో కంప్యూటర్లను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీ నేతల హస్తం ఉందని కోడెల ఆరోపించారు. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన సత్తెనపల్లిలోనే ఉన్నారు. రాత్రి 8 గంటలకు ఆయన గుంటూరుకు చేరుకొన్నారు. పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నసమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు.