తన పేరిట ఫేక్ అకౌంట్లతో అసత్య ప్రచారం అంటూ మాండ్య ఎంపీ, సినీ నటి సుమలత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ఫేక్ అకౌంట్లతో తనను వేధిస్తున్నారంటూ బెంగళూరు తన పేరుతో 7 నకిలీ అకౌంట్లు తెరిచి వాటి ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫేక్ అకౌంట్లు తన అభిమానులు, కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో తన పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సుమలత కోరారు.