telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

గుంటూరు మిర్చి యార్డులో కరోనా కన్నెర్ర!

mirchi yard guntur

ఏపీలోని గుంటూరు మిర్చి యార్డులో కరోనా కన్నెర్రజేసింది. యార్డులో వ్యాపారం నిర్వహించే ముగ్గురికి వైరస్ సోకడంతో యార్డును మూసివేశారు. ఇక్కడికి నిత్యమూ వందల సంఖ్యలో రైతులు తమ మిర్చి పంటను తెచ్చి అమ్ముతుంటారు. ఇక యార్డులో వ్యాపారులకు కరోనా సోకడంతో, వారు వ్యాపారం నిర్వహించే ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు.

శని, ఆదివారాలు ఎలానూ మార్కెట్ కు సెలవు కాబట్టి, తిరిగి సోమవారం పరిస్థితిని సమీక్షించి యార్డును తెరిపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈలోగా యార్డు మొత్తాన్ని సోడియం హైపోక్లోరైడ్ తో శానిటైజ్ చేస్తున్నామని అన్నారు. వైరస్ సోకిన వ్యాపారుల వద్దకు వచ్చిన రైతులు, కూలీలను గుర్తించి వారిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related posts