telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

srikanthreddy ycp

రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణాభివృద్ధికి రూ.340 కోట్లు కేటాయించారని అన్నారు.

జగన్ లాంటి నాయకుడితో కలిసి పనిచేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఏ తప్పు చేయకుండా ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తామని మరోమారు ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. సీఎం జగన్ ది ఉక్కు సంకల్పం అని, మన కలలను నెరవేరుస్తున్న నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. 

Related posts