telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ వన్డే సిరీస్ : .. టాస్ గెలిచి … ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ …

india won toss and choose fielding

వెస్టిండీస్‌ వన్డే సిరీస్ లో భారత్ తొలి వన్డేలో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడంలో ఆటను 43 ఓవర్లకు కుదిరించారు. శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. 299 వన్డే ఆడుతున్న విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ విండీస్‌ తరుపున అత్యధిక​ వన్డేలు ఆడిన బ్రియన్‌ లారా రి​కార్డును సమం చేశాడు.

భారత జట్టు : విరాట్‌కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌

వెస్టిండీస్‌ జట్టు : జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎల్విన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, హేట్‌మేయర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ చేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లొస్‌ బ్రాత్‌వైట్‌, కీమర్‌ రోచ్‌, షెల్డన్‌ కాట్రేల్‌

Related posts