ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
ఇప్పటికే రెండు జిల్లాల్లో యాత్ర పూర్తి చేస్తున్నారు మొదట ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించారు.
మూడో జిల్లాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాను ఎంచుకున్నారు. ఈనెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించి.. పలువురు ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
అక్కడ మిగిలిన రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. సాయంత్రం శిరివెళ్లలో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు.
రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్కు లేదు: సీపీఐ నారాయణ