ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలోని ధర్నా చౌక్లో రైతులు నిర్వహిస్తోన్న నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజధానిపై జగన్కు మూడు ముక్కలాట ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్ర రాజధాని మార్పు వల్ల ఎన్నో నష్టాలు వస్తాయని ఆయన తెలిపారు. అక్రమాలకు పాల్పడేందుకే వైసీపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలకు కావాల్సింది రాజధాని కాదని, విశాఖ సెజ్లో వచ్చే లక్షల కోట్లని ఆరోపించారు.