అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పారు. తన స్వస్థలమైన, ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని ఇప్పటికే పలు పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందినట్లు రాబర్ట్ చెప్పారు.అయితే దీనిపై ఆయన కుటుంబ సభ్యులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రాబర్ట్ స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేస్తున్న భాజపా, ఇతర ఏ పార్టీపై అయినా పోరాడేందుకు రాజకీయాల్లోకి రావడం ఒక్కటే మార్గమని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
బీజేపీ పై పోరాడాలంటే రాజకీయ ప్రవేశం తప్పదన్నది రాబర్ట్ వాద్రా ఆలోచన. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఇప్పటివరకు బిజినెస్ మ్యాన్ గా ఉన్న రాబర్ట్ వాద్రా.. సామాజిక సేవా కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటున్నా అది ఎంతవరకు లాభిస్తుందో చూడాలి మరీ .
ఇప్పటికైతే రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీల వల్ల కానిది.. రాబర్ట్ వాద్రా వల్ల అవుతుందా అంటే అని చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అవుతుంది.