telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అదుపు త‌ప్పి ఫ‌ల్టీలు కొట్టిన కారు..ముగ్గురు మృతి

car accident

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. నారాయ‌ణ‌పురం గ్రామ స‌మీపంలో మొగిలిపాడు ఫ్లైఓవ‌ర్ ద‌గ్గ‌ర జాతీయ ర‌హ‌దారిపై కారు అదుపు త‌ప్పి ఫ‌ల్టీలు కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందారు. మ‌రో తొమ్మిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

12 మంది ప్ర‌యాణికులు కారు అద్దెకు తీసుకుని జార్ఖండ్ నుంచి విశాఖకు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్ర‌మాదం గురించి స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ప‌లాస‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందగా మిగ‌తా తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts