ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపురం గ్రామ సమీపంలో మొగిలిపాడు ఫ్లైఓవర్ దగ్గర జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
12 మంది ప్రయాణికులు కారు అద్దెకు తీసుకుని జార్ఖండ్ నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలాసలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందగా మిగతా తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.