telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే…

నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మేలును చెప్పుకుంటూ.. గర్వంగా తాము ఓటు అడుగుతున్నామన్న ఆయన.. కానీ, టీడీపీ ఏమీ చెప్పుకొని ఓటు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఈ ఎన్నికలు మా అభివృద్ధి, సంక్షేమానికి రెఫరెండంగా భావిస్తూ..ప్రజల్లోకి వచ్చాం.. మా మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన రాజీనామాల సవాల్ ని స్వీకరించే దమ్ము మీకు ఉందా? అని ప్రశ్నించారు.  ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచార సభ విరమించుకుంటే దానిపై కూడా రాజీనామా? అని మండిపడ్డారు మంత్రి అనిల్.. మరి పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వస్తే.. పవన్ ఇంట్లో పడుకుంటే.. టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.. మరోవైపు.. వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించిన మంత్రి అనిల్.. పవన్ సినిమా టికెట్ల ధరల పెంచొద్దు అంటే.. చంద్రబాబు ఏం నొప్పి అంటూ ఫైర్ అయ్యారు.. బ్లాక్ మార్కెట్ ని మేం ప్రోత్సహించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts