telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాజీ మంత్రులపై తప్పుడు కేసులు..గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

chandrababu

టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసిన చంద్రబాబు ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. ఈ మేరకు గవర్నర్ కు 14 పేజీలతో సుదీర్ఘ లేఖ సమర్పించారు.

కేవలం 4 రోజుల వ్యవధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సంవత్సరకాలంలో 800 మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు గురయ్యారని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.

Related posts