ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. ఇది ఇలా ఉండగా.. ఏకగ్రీవాల కోసం వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే.. నిమ్మగడ్డ మాత్రం ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. బలవంతపు ఏకగ్రీవాలు దారుణమని చెబుతున్నారు. అయినప్పటికీ ఏపీలో విపరీతంగా ఏకగ్రీవాలు పెరిగాయి..
జిల్లాల వారీగా ఏకగ్రీవాల సంఖ్య
►చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం
►గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం
►కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం
►వైఎస్ఆర్ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం
►పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం
►శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం
►విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం
►తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం
►కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం
►ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం
►నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం
►అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్బాబు