ఆస్ట్రేలియా జట్టుపై గెలిచిన ఉత్సాహంలో టీం ఇండియా మరో సమరానికి రెడీ అయిపోయింది. ఇవాళ ఇంగ్లండ్-ఇండియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. అయితే..ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. చిదంబరం స్టేడియంలో మరికాసేపట్లో ఇంగ్లండ్, ఇండియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్నది. ఇండియా జట్టులోకి నదీమ్, సుందర్లు వచ్చారు. ఆస్ట్రేలియా టూర్లో జరిగిన చివరి మూడు టెస్టులకు కెప్టెన్సీ నుంచి దూరమైన కోహ్లీ.. మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. జో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగనుంది. ఇక టీం ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది.
టీం ఇండియా
విరాట్ కోహ్లీ{కెప్టెన్}, రహానే, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్గిల్, అశ్విన్, పుజారా, బుమ్రా, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, నదీమ్
ఇంగ్లాండ్
జో రూట్ {కెప్టెన్}, లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి