telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పిడుగుపాటు ఘటన దురదృష్టకరం: మంత్రి హరీశ్‌రావు

harish rao trs

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పలుప్రాంతాల్లో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. సిద్దిపేటలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం ఇద్దరి ప్రాణాలను తీసింది. సిద్దిపేట జిల్లా మార్కెట్‌ యార్డు సమీపంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. చింతల చెరువు సమీపంలో బాలరాజ్‌, శ్రీనివాస్‌ అనే ఇద్దరు వ్యక్తులపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటు ఘటన దురదృష్టకరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పక్షాన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Related posts