ఐపీఎల్ ఫేజ్-2 కోసం భారత్- ఇంగ్లండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మార్పులు చేయడానికి కూడా బీసీసీఐ సిద్దమైందనే వార్తలు వినిపించాయి. సెప్టెంబర్ విండో కోసం భారత్- ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ను మార్చాలని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డును సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అవసరమైతే రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున నిర్వహించైనా ఐపీఎల్లోని మిగిలిన 31 మ్యాచ్లను పూర్తి చేయవచ్చని భారత బోర్డు భావిస్తోంది. అయితే ఐపీఎల్ సెకండాఫ్ పూర్తి చేయాలంటే తానిచ్చే సింపుల్ సొల్యూషన్ను ఫాలో కావాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూచించాడు. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ను ఓ వారం ముందుకు జరపాలని, దాంతో ది హండ్రెడ్ లీగ్కు దూరమయ్యే ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్లేస్లో టెస్ట్ మ్యాచ్లు ఆడని భారత ఆటగాళ్లను ఆడేందుకు బీసీసీఐ అనుమతించాలని ట్వీట్ చేశాడు. ఇది ఇరు బోర్డులకు లాభం చేకూర్చే విషయమన్నాడు. ‘ఐపీఎల్ 2021 సెకండాఫ్ నిర్వహణకు చాలా సింపుల్ సొల్యూషన్. ముందుగా భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ను ఓ వారం ముందుకు జరపాలి. ఈ సిరీస్ కారణంగా ది హండ్రెడ్ లీగ్కు దూరమయ్యే ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్లేస్ల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడని భారత ఆటగాళ్లను బరిలోకి దించాలి. అప్పుడు ఐపీఎల్ను పూర్తి చేయవచ్చు. ఇరు బోర్డులకు ఇది మంచి డీల్’అని పేర్కొన్నాడు.
previous post