సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య ప్రయాణికుల సౌకర్యార్థం రాయనపాడు మీదుగా 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్.రాకేష్ తెలిపారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ ఏసీ వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్: 08408) సికింద్రాబాద్ నుంచి జూలై 5, 12, 19, 26, ఆగస్టు 2, 9, 16, 23, 30, సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో రాత్రి 9.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 5.15కు భువనేశ్వర్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్-సికింద్రాబాద్ ఏసీ వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్: 08407) భువనేశ్వర్ నుంచి జూలై 4, 11, 18,25, ఆగస్టు 1, 8,15,22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26వ తేదీల్లో మధ్యాహ్నం 1.20కు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు ఏసీ త్రీ టైర్ బోగీలను కలిగి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా