telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఇంటికి చేరే మార్గం లేక..డిశ్చార్జి అయిన రోగుల ఇబ్బందులు

Brain disease in bihar 97 children death

కొన్ని నెలల క్రితం రోగానికి చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేరిన వారు, ఆయా కారాణాలతో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిని ఆసుపత్రి సిబ్బంది డిశ్చార్జి చేసింది. దీంతో రోగులకు రోగం నుంచి కోలుకుంటామన్న ధైర్యం వచ్చింది. కానీ ఆసుపత్రి బయటకు వస్తే ఊరికి వెళ్లే మార్గం కానరాక వందలాది మంది పేషెంట్లు, వారి సహాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా ప్రయాణ సౌకర్యం లేకపోవడం, బయట ఉండేందుకు కూడా అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో కూడా నెలకొంది. వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్ వెన్నెముక సమస్యతో పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ లో చేరాడు. శస్త్రచికిత్స పూర్తయింది. వైద్యులు గురువారం డిశ్చార్జి చేశారు. కానీ ఇప్పుడు ఊరికి ఎలా చేరాలో అతని కుటుంబానికి అర్థం కావడం లేదు.

నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు.ఈ ఆసుపత్రుల్లో చేరే వారిలో ఎక్కువ మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే. నిరుపేదలు కావడంతో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన వారే. నిస్సహాయ స్థితిలో వీరు వంద నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరుతున్నారు. అయితే తాము వాహనాలను సమకూర్చలేమని, ప్రైవేటు వాహనాన్ని సమకూర్చుకుంటే అది ప్రయాణించేందుకు అనుమతిస్తామని పోలీసులు అంటున్నారు.

Related posts