సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు అధికార పార్టీ తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కాంగ్రెస్ మహిళా నేత వైసీపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కిల్లి కృపారాణి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 19న లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. ఆయన సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకోనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పినప్పటి నుంచి ఉన్న నేతలు ఒక్కొక్కరూ ఆ పార్టీకీ గుడ్ బై చెబుతున్నారు.
భావితరాల సంక్షేమం కోసం జగన్ కృషి: మంత్రి బొత్స