తిన్నింటి వాసాలు లెక్క పెట్టే సంస్కృతి వైసీపీదేనని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్ది అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ బొమ్మపెట్టుకొని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై వైసీపీ నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లను చీల్చడానికే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం లేదంటూ.. వైసీపీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన జగన్కు బీజేపీ నుంచి ఎంత ముట్టిందో చెప్పాలని అన్నారు. అలాగే తెలంగాణాలో వైసీపీ పోటీ చేయకుండా.. టీఆర్ఎస్కు మద్దతిచ్చినందుకు జగన్కు ఎంత సొమ్ము ముట్టిందో చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే నిరసనలు: మంత్రి అవంతి