దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడకు మొట్టమొదటి ప్రయాణికుల రైలు చేరుకుంది. న్యూఢిల్లీ- చెన్నై స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం విజయవాడ జంక్షన్ చేరుకుంది.
ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల నుంచి 318 మంది ప్రయాణికులు విజయవాడ వచ్చారు. ఈ రైలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఏపీలో ప్రవేశించింది. ఇదే ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ నుంచి 282 మంది ప్రయాణికులు చెన్నై వెళ్లారు. కాగా, విజయవాడలో దిగిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసి ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు.