ప్రజాసమస్యల స్వీకారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు
గత వారం తూర్పు గోదావరి జిల్లాలో రైతు భరోసా యాత్రతో పాటు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు
పవన్ తో పాటు పలువురు ముఖ్యనేతలు, జనసేన ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలకు గురయ్యారు. దీంతో ప్రతీ ఆదివారం నిర్వహించాలనుకున్న జనవాణి కార్యక్రమాన్ని వచ్చే వారం వాయిదా వేశారు. మాములుగా అయితే వచ్చే ఆదివారం జరగాల్సి ఉంది. కానీ పవన్ కల్యాణ్కు జ్వరం రావడం వల్ల వచ్చే వారం జనవాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు.
మళ్లీ నెలాఖరు రోజున అంటే 31వ తేదీన ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందని ఎక్కడ జరుగుతుందన్నదానిపై తర్వాత ప్రకటన చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటికి రెండు వారాలు విజయవాడలో.. ఓ వారం తూ.గో జిల్లాలో జరిగింది. అందుకే ఈ సారి ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాల్లో నిర్వహించనున్నారు.
ఈ నెల 31న తదుపరి జనవాణి – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/k9mWoMNt3Q
— JanaSena Party (@JanaSenaParty) July 20, 2022