telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మోదీ ధ్యానం చేసిన గుహకు భలే డిమాండ్..

modi tour

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లిన సందర్భంగా గుహలో మోదీ కొన్ని గంటల పాటు ధ్యా నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గుహకు భక్తులు, యాత్రికుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే జులై నెలంతా బుక్కైపోగా, ఆగస్ట్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో కూడా కొన్ని తేదీలకు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నారు. ఈ గుహ కేదార్‌నాథ్‌ దేవాలయానికి ఒక కిలోమీటర్‌ దూరంలో ఉంది.

ప్రధాని ఈ గుహను సందర్శించిన తర్వాత ఇప్పటి వరకు గుహ ఒక్క రోజు కూడా ఖాళీగా లేదని జనరల్‌ మేనేజర్‌ బీ ఎల్‌ రానా వెల్లడించారు. ఈ గుహలో ధ్యానం చేయాలనుకునేవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే అనుమతిస్తారు. గుహ రుసుము ఒకరోజుకు 990 రూపాయలు. అంతేకాక, అలాంటి గుహలు ఏర్పాటు చేయడానికి అక్కడే మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు రుద్రప్రయాగ్‌ కలెక్టర్‌ తెలిపారు.గత ఐదేళ్లలో ప్రధాని మోదీ నాలుగు సార్లు కేదార్‌ నాథ్‌ను దర్శించుకున్నారు.

Related posts