telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి: జనసేన

తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు, గోషామహల్ స్టేడియానికి తరలించారు.

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అవకతవకల వ్యవహారంపై దోషులను కఠినంగా శిక్షించాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాల వద్ద విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.

Related posts