తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,816 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 27 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 5892 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,28,823 కు చేరగా.. రికవరీ కేసులు 4,74,899 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,955 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 84.2 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 89.80 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, నిన్న ఒకే రోజు 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు..బులెటిన్లో పేర్కొంది సర్కార్.
next post
అమరావతిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు