డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 29నుంచి ప్రారంభం కానున్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 29నుంచి 4వ తేదీ వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 11వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు మే 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 29వ తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్పోర్టల్తో పాటు సంబంధిత అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.
పోతిరెడ్డిపాడును జగన్కు కేసీఆర్ గిఫ్ట్గా ఇచ్చారు: రేవంత్రెడ్డి