telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజల ఇబ్బందులను గవర్నర్ లేవనెత్తారు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదారెడ్డి కౌంటర్ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ప్రజల ఇబ్బందులను గవర్నర్ లేవనెత్తారని తెలిపారు. గవర్నర్ వ్యాఖ్యలతో తాము కూడా ఏకీభవిస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు.

గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భజనపరుల ద్వారా ఎదురు దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదారెడ్డితో కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీరు ప్రజాస్వామ్యానికి చేటు కలిగించేలా ఉందని చెప్పారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని తెలిపారు.

Related posts