ప్రముఖ సీనియర్ హీరోయిన్ కుష్బూ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాదు తాను కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉంటానని, బుధవారం ఉదయం పొరపాటున కంటికి కత్తి తగిలి తనకు గాయమైందని కుష్బూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన కంటికి గాయమవ్వడంతో వైద్యులు చిన్న సర్జరీ ద్వారా కుట్లు వేసి రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపింది. “మీరందరు తగిన జాగ్రత్తలు తీసుకొని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించండి” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
previous post
అమలాపాల్ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం అది కాదట…!