telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

హాంకాంగ్‌ : … సెమీఫైనల్లో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ .. ఓటమి ..

kidambi srikanth lost in hongkong open

హాంకాంగ్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఓటమిపాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో స్థానిక ఆటగాడు లీ చుక్ యూ చేతిలో 9-21, 23-25 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. తొలి గేమ్‌లో ఆది నుంచే లీ ఆధిపత్యం చెలాయించాడు. 1-6తో తొలి గేమ్‌లో వెనుకంజలో ఉన్న కిదాంబి ప్రత్యర్థిని ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. కానీ, లీ 21-9తో గేమ్‌ను ముగించాడు.

రెండో గేమ్‌లో కిదాంబి అద్భుతంగా పుంజుకొని 5-1తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ, లీ గొప్పగా పోరాడటంతో రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. కానీ, ఆఖర్లో లీ పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతంచేసుకున్నాడు. దీంతో హాంకాంగ్‌ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, సాయి ప్రణీత్‌, కశ్యప్‌ క్వార్టర్స్‌కు కూడా అర్హత సాధించలేదన్న విషయం తెలిసిందే.

Related posts